1.5.25

ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు




వైఖానస అచార్యులు శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు బుధవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగాయి.

తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధినీ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైఖానస ఆగమ పండితులు శ్రీ ప్రభాకరాచార్యులు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధనీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు, కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు పాల్గొని ఆ ఇద్దరు మహానుభావులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

No comments :
Write comments