15.6.25

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు Aswa Vahanam










అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 - 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments