అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం చేపట్టారు. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలోటిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments