6.6.25

టీటీడీ సీవీఎస్వోగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరణ





టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆల‌య అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో శ్రీ వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments