9.6.25

గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం Gaja Vahanam

















తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారు గ‌జ వాహ‌నంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి , పలువురు అధికారులు , శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments