20.7.25

జూలై 20 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు Pushkarani




తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు జూలై 20 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.


శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది .

No comments :
Write comments