26.7.25

జూలై 28న టిటిడి పాఠశాలల్లో సద్గమయ Sadgamaya Programme




తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా జూలై 28వ తేదీన టిటిడి పాఠశాలల్లోని విద్యార్థులకు మానవీయ, నైతిక విలువు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చేందుకు సద్గమయ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో  1. తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, 2. ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, 3. ఎస్వీ హైస్కూల్, 4. ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , 5. ఎస్పీ బాలికల పాఠశాల, 6. తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్, 7. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ లలోని 8, 9, 10 తరగతుల డే స్కాలర్ల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ శిక్షకులచే శిక్షణ ఇవ్వనున్నారు.  


సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువ‌లు,  నైపుణ్యాలు, సంస్కృతి - సాంప్ర‌దాయాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు తదితర అంశాలపై విశ్లేనాత్మకంగా శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు.

తిరుపతి, తిరుమలలోని 7 పాఠశాలల్లో డే స్కాలర్లకు రోజుకు ఒక గంట చొప్పున 4 రోజుల పాటు సద్గమయ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.  

No comments :
Write comments