తిరుచానూరు శ్రీ
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరు చానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడి కి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచిం చారు. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా ని ర్వహించనున్నట్లు తెలిపారు. అనం తరం సాయంత్రం 6 గంటలకు స్వర్ ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తు లకు దర్శనమివ్వనున్నట్లు చెప్పా రు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు( ఇద్దరు) రూ.1000/- చెల్లించి పా ల్గొనవచ్చన్నారు. ఈ కారణంగా అభి షేకం, అభిషేకానంతర దర్శనం, లక్ ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకు ని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికా రులకు సూచించారు. వరలక్ష్మీ వ్ రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్ పాటుచేయాలని, భక్తులకు తాగునీరు , అన్నప్రసాదాలు విరివిగా పంపి ణీ చేయాలని ఆదేశించారు. భక్తు లకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్ యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ ధంగా ఉంచుకోవాలన్నారు. ఆకట్టుకు నేలా భజన బృందాలను ఏర్పాటు చేయా లన్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థా న మండపం, ఇతర ప్రాంతాల్లో మరిం త ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలం కరణ చేపట్టాలని సూచించారు. స్థా నిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉం డేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ లో ప్రత్యక్ష ప్రసారాలు అందించేం దుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్ తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్ స్, సూచిక బోర్డులు, ఎల్.ఈ.డీ స్క్రీన్ లు ఏర్పాటు చేయాలన్నా రు. అవసరమైన శ్రీవారి సేవకులు, పా రిశుద్ధ్య కార్మికులు, సెక్యూరి టీ గార్డులను సమకూర్చుకోవాలన్నా రు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకా శం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్ లు చేపట్టాలన్నారు.
పురాణ ప్రాశస్త్యం :
పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచే సినట్లు స్కంద, భవిష్యోత్తర పు రాణాల ద్వారా తెలుస్తుంది. కావు న సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూ రు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్ చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్ రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌ ఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగు తాయని పురాణాల ద్వారా తెలుస్తుం దని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ శ్రీనివాస చార్యులు, శ్రీ బాబు స్వామి, శ్రీ మణికంఠ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ పి. హరిం ద్రనాథ్, ఎస్.ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, విజీ వో శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.




No comments :
Write comments