27.7.25

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ AP CS










ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.


స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను ఈవో శ్రీ జె.శ్యామలరావు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments