అప్పలాయగుంట శ్
ఈ ఆలయంలో జూన్ 07 నుండి 15వ తే దీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైం కర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్ లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయా గం నిర్వహించడం ఆనవాయితీగా వస్ తోంది.
ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవే రులతో కూడిన శ్రీ ప్రసన్న వేం కటేశ్వరస్వామి వారికి స్నపనతిరు మంజనం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. ఇందులో పాలు, పెరుగు, తే నె, చందనం, కొబ్బరి నీళ్లతో వి శేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పు ష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్ రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు.
మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రో చ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తు లసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్ వహించారు. ఒక టన్ను పుష్పాలను ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయా నికి టిటిడి సరఫరా చేసింది. ఆద్ యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్ పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్ రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దే వరాజులు, సూపరింటెండెంట్ శ్రీ మతి శ్రీవాణి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్ నారు.









No comments :
Write comments