తిరుమల శ్రీవారి
ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ య చౌదరిలతో కలిసి ఈవో శ్రీ జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ , సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్ మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్ వదినాల ముందు వచ్చే మంగళవారం కో యిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్ వహించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొ దలుకొని బంగారువాకిలి వరకు, శ్ రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పై కప్పు, పూజాసామగ్రి తదితర వస్తు వులను నీటితో శుభ్రంగా కడుగుతా రని చెప్పారు.
కాగా, స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి , శుద్ధి అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు , గడ్డ కర్పూరం, గంధం పొడి, కుం కుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్ రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చే శారు. ఆ తరువాత స్వామివారి మూ లవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్ యం కార్యక్రమాలను అర్చకులు శాస్ త్రోక్తంగా నిర్వహించారు. అనం తరం భక్తులకు దర్శనం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్ మారాధన సేవను టీటీడీ రద్దు చేసిం ది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్ రీ నరేష్ కుమార్, శ్రీ శాంతా రా మ్, శ్రీ సదా శివరావు, శ్రీ జం గా కృష్ణ మూర్తి, శ్రీమతి జానకి దేవి, శ్రీ మహేందర్ రెడ్డి, సీ వీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్ యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధి కారులు పాల్గొన్నారు.







No comments :
Write comments