3.7.25

సోషల్ మీడియాలో హోటళ్ల ధరలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు social media




ఇటీవలి కాలంలో “తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు” పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్‌ టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం.


ఈ మెసేజ్‌లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితం.

ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ (www.tirumala.org), టీటీడీ కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరడమైనది.

ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

No comments :
Write comments