29.7.25

టిటిడి పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమైన సద్గమయ శిక్షణా తరగతులు TTD Schools










తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గమయ శిక్షణ కార్యక్రమం తిరుపతి, తిరుమలలోని టిటిడికి చెందిన 7 పాఠశాలల్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో  1. తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, 2. ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, 3. ఎస్వీ హైస్కూల్, 4. ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , 5. ఎస్పీ బాలికల పాఠశాల, 6. తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్, 7. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ లలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ అద్యాపకులచే శిక్షణ ఇస్తున్నారు.  


సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తి భావం, భగవద్గీత పరిచయం, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహహలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సంస్కృతి - సాంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషనాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు.  ఈ నెల 31వ తేదీ చివరి రోజు శిక్షణ అనంతరం విద్యార్థులకు సంబంధిత అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

తిరుపతి ఎస్.జి.ఎస్. హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిఈవో శ్రీ వెంకట సునీల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        

No comments :
Write comments