ప్రముఖ వైష్ణవా
ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితు లు శ్రీ తిరుమల నంబి జీవిత చ రిత్రపై ఉపన్యసించనున్నారు.
శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరై న శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటే శ్వరస్వామివారికి తీర్థ కైంకర్ యం ప్రారంభించారు. వీరు భగవద్రా మానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పు రాణాల ద్వారా తెలుస్తోంది.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాం చిన శ్రీ తిరుమలనంబికి సంబంధిం చిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరు మలనంబి శ్రీవేంకటేశ్వరస్వామివా రి అభిషేకానికి సంబంధించిన పవి త్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి .మీ దూరంలో ఉన్న పాపవినాశనం తీ ర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీ టిని కుండలో తీసుకొస్తుండగా సా క్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తిరుమలనంబి భక్తిని పరీక్ షించాలని భావించి ఒక వేటగాని రూ పంలో వచ్చి దాహంగా ఉందని, తాగడా నికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషే కం కోసమని చెప్పి ఇచ్చేందుకు తి రుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.
అందుకు తిరుమలనంబి బాధపడుతూ ” వయోభారం కారణంగా నేను తిరిగి అం తదూరం పాపవినాశనం వెళ్లి స్వామి వారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామి వారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతిం చకు తాతా నేను నీ పూజకు తప్పకుం డా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోని కి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకు తూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూ పంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్ యారు. అప్పుడు తిరుమలనంబి సాక్ షాత్తు స్వామివారే బాలుని రూపం లో ప్రత్యక్షమయ్యారని గ్రహించా రు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీ ర్థాన్నే స్వామివారి అభిషేకాని కి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థాని కి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడిం ది.

No comments :
Write comments