14.8.25

టీటీడీ పరిపాలనా భవనంలో 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు indipendence day









ఆగష్టు 15న నిర్వహించే 79వ భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.


జాతీయ జెండా వందనం అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన  వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

No comments :
Write comments