శ్రీవా
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం లో భాగంగా ఆగస్టు 25 – సెప్టెంబరు 8 వరకు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు శ్రీ వేం కటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి లో జరుగుతున్నవి.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రారం భించిన నేత్రదాన కేంద్రం కార్ యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ చేసిన ఈఓ మాట్లాడుతూ, “సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ ” అనే సంస్కృత వాక్యాన్ని ఉదహరి స్తూ, శరీరంలోని అన్ని ఇంద్రియా లలో కంటికి ఉన్న ప్రాధాన్యత అత్ యంత ఉత్కృష్టమైనది అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆరు ఎకరాల వి స్తీర్ణంలో తిరుపతి నగరంలో ఈ సు ప్రసిద్ధ కంటి ఆసుపత్రి స్థాపిం చబడిందని గుర్తు చేశారు.
ప్రతి సంవత్సరం మన దేశంలో కార్ నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ (కం టి మార్పిడి) కోసం కనీసం ఒక లక్ ష కళ్ళు అవసరం ఉంటే, కేవలం 25 వేల కళ్ళే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 11 లక్షలకు పైగా రోగులు కార్నియల్ ట్రాన్ స్ప్లాంట్ కోసం ఎదురుచూస్తున్ నారని, ఒక్కరి నేత్రదానం ద్వారా నే ఇద్దరికి దృష్టి లభిస్తుందని చెప్పారు.
అరవింద్ కంటి ఆసుపత్రిలో 80 శా తం కంటి సమస్యలకు అత్యల్ప ఖర్చు తో ఆధునిక వైద్యసేవలు అందిస్తు న్నారని, ఆసుపత్రి వైద్యులు, సి బ్బంది కృషిని అభినందించారు. హా ర్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) అధ్యయనాలు కూడా అరవింద్ నేత్రా సుపత్రిని సామాజిక ఆరోగ్య సేవల్ లో ఆదర్శంగా గుర్తించిందన్నారు.
“డయల్ యువర్ ఈఓ” కార్యక్రమంలో ఒక భక్తుడు చేసిన సూచన మేరకు ఈ నేత్రదాన కేంద్రం ఇవాళ తిరుపతి లో ప్రారంభించడం జరిగిందని చెప్ పారు. కంటి దానం ద్వారా 80% వరకు అంధత్వ సమస్యలను అధిగమిం చవచ్చని, అందుకొరకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రపంచ ప్రసిద్ధ హైందవ ధార్మిక సంస్థ అయిన టిటిడి అనేక సేవా కా ర్యక్రమాలు చేపడుతోందని, నేత్ రదానం వంటి సేవా కార్యక్రమాల్లో భక్తులు ముందుకు రావాలని ఈఓ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ముందుగా ఎస్వీ అరవింద్ ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరిం చారు. 2024లో 3.5 లక్షల అవుట్పేషెంట్ లకు చికిత్స అందించి, 5 వేల శస్త్రచికిత్సలు నిర్వహిం చామన్నారు. ప్రతి సంవత్సరం కే వలం 25 వేల కంటి దానాల ద్వారానే అవసరం తీరుతుందని, మరింత చైతన్ యం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ మరియు డైరెక్టర్ డాక్టర్ ఆర్. వి. కుమార్, అరవింద్ ఆసుపత్రి జీఎం శ్రీ కేశవకుమార్, డీఎంహెచ్ ఓ శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఆఫ్ థాల్మాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్ యక్షుడు డాక్టర్ సురేంద్ర, టిటి డి ఎస్ఎంఓ డాక్టర్ కుసుమతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు .



No comments :
Write comments