3.8.25

తిరుపతిలో తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి tarigonda vengamamba




మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల  వెంగమాంబ విగ్రహానికి శనివారం టిటిడి శ్వేతా విభాగం అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

 
అనంతరం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీమతి బి. మంజుల, శ్రీమతి టి. తేజోవతి బృందం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందం శ్రీ వెంగమాంబ కీర్తనలతో సంగీత కచేరి నిర్వహించారు. అటు తర్వాత శ్రీనివాస కళ్యాణంపై శ్రీ కె. చంద్రశేఖర్ బృందం హరికథను గానం చేశారు. సాయంత్రం 5.30  నుండి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

No comments :
Write comments