తిరుమలలో
ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సే వను టీటీడీ రద్దు చేసింది.
ప్రాముఖ్యత:
తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “ భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo” , మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ ని భక్తులు శుద్ధి చేసే కార్యక్ రమం అని అర్థం.
ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్ రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్ లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చే స్తారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుం డి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్ రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దే వతలు, దీపం మరియు పూజ వస్తువు లను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు.
ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్ రం ప్రకారం నిర్వహించబడుతుంది.
కాగా సంవత్సరానికి నాలుగు సార్ లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహి స్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మం గళవారం నాడు ఈ వేడుకను నిర్వహిం చడం ఆనవాయితీ.
సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు:
టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్ రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్ రముఖులకు మినహా) రద్దు చేసింది. కావున సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీ టీడీకి సహకరించవలసిందిగా విజ్ ఞప్తి చేయడమైనది.
.jpg)
No comments :
Write comments