తిరుమల శే
శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్ రాకారాలున్నాయి. ఆలయం గోడలు వె య్యేళ్ల క్రితం నాటివిగా శాసనా ల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవా రి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి.
శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్ నో రాజవంశాలకు చెందిన రాజులు, రాణులు, సేనాధిపతులు, ఇంకెందరో భక్తులు ఇతోధికంగా విరాళాలు అం దించి సహకరించారు. అద్భుత నిర్ మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోని మం డపాలను ఆనాటి చక్రవర్తులు, రాజులు అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో నిర్మిచారు. ఇందులో మహాద్వారం, కృష్ణరాయమండపం, రం గనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఆఐనా మహల్, ధ్ వజస్తంభ మండపం, కళ్యాణ మండపం త దితరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పైకప్పు, స్థంభాలపై కృష్ణస్ వామివారు, లక్ష్మీ నరసింహస్ వామి, వరాహస్వామి, శ్రీ వేంక టేశ్వరస్వామి తదితర దేవతా మూర్తులు, లక్ష్మీదేవి అమ్మవా రి వివిధ రూపాలు, జంతువులు, ల తలు, పుష్పాలతో కూడిన శిల్పా లతో నిర్మించారు.
ప్రధాన గోపురం లేదా మహాద్వా రమును 13వ శతాబ్ధంలో నిర్మించి నట్లు ఆలయంలోని శాసనాల ద్వా రా తెలుస్తోంది. ఇక్కడే కుడిగో డపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వ్రేలాడదీయబడి ఉంటుంది.
కృష్ణరాయమండపం :
మహాద్వారానికి ఆనుకొని లోపలి వై పు 16 స్థంభాలపై ముసలిపై ఉన్ న సింహం, దానిపై కుర్చుని స్వా రి చేస్తున్న వీరుల శిల్పాలతో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమం డపం. ఈ మండపంలో కుడివైపున తిరు మల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగి రి రాజైన వెంకటపతి రాయల రాగిప్ రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువై న అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్ లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.
రంగనాయక మండపం :
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రా యలు క్రీ.శ 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారు. ఈ మండమంలో వివిద రకాల శిల్పా లతో సుందరంగా మండప నిర్మాణం జరిగింది. క్రీ.శ 1320 – 1360 మధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్ లే దీన్ని రంగనాయక మండపమని పిలు స్తున్నారు.
తిరుమలరాయ మండపం :
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తం భాల మండపమే ఊంజల్మండపం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మం డపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్ మించగా, క్రీ.శ.16వ శతాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆరవీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందు లోని స్థంభాలపై శ్రీ వైష్ణవ, పశు-పక్షాదుల శిల్పాలు ఉన్నా యి. ఈ మండపంలో రాజా తోడరమల్ , అతని తల్లి మాతా మోహనా దే వి, భార్య పిటా బీబీ లోహ విగ్ర హలు ఉన్నాయి.
బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేం చేసి పూజలందుకుంటారు.
అద్దాల మండపం – ఆఐనా మహల్ :
కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్ కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఆఐనా మహల్ అంటారు. దీనిని 36 స్ థంభాలతో అద్భుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం, అంతరాళం, గర్ భగృహం ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు.
ధ్వజస్తంభ మండపం :
రెండవ గోపురమైన వెండి వాకిలి ని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజయనగర చక్ రవర్తి సాళువ నరసింహరాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాలతో నిర్మిచిన మండపంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాలపై వివిద దేవతామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్ రీ, పురుషుల సంబంధాలను తెలిపే అనేక శిల్పాలు పొందుపరిచారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలి రోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారో హణం అంటారు.
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీ ఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనం తరం అర్చకులు బలిని ఆయా దిక్కు ల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకం గా సమర్పిస్తారు.
వసంత మండపం
తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్ రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.
కళ్యాణ మండపం :
శ్రీవారి గర్భాలయానికి దక్షి ణంవైపు క్రీ.శ.1586లో శ్రీ అవ సరం చెన్నప్ప అనే నాయకుడు క ల్యాణ మండపాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో 27 స్థంబా లతో నిర్మించారు. ఇందులో మధ్ య భాగంలో నాలుగు చిన్న స్తంభా లు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నది. పూర్వకాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీ మలయప్పస్వామి వారికి, శ్ రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహించేవారు.
తిరుమామణి మండపం :
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. సుప్రభాత సే వలో భక్తులు ఇక్కడి నుండే శ్రీ వారి సేవలో పాల్గొంటారు.
స్నపన మండపం :
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్ లిన వెంటనే ఉండేదే ‘స్నపనమండపం’ . క్రీ.శ.614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్ రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ ని సమర్పించింది. ఈ స్నపనమండపా న్నే తిరువిలాన్ కోయిల్ అంటా రు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయం లో ఈ మండపం నిర్మించబడిందని చె బుతారు.
రాములవారి మేడ :
స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించేదే ”రాములవారి మేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయి న ప్రదేశం అని అర్థం. ఇక్కడ రా ములవారి పరివారమైన అంగద, హనుమం త, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్ రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోం ది అని కూడా అంటారు.
శయనమండపం :
రాములవారి మేడ దాటి లోపల ప్రవే శించిన వెంటనే ఉన్న గదే శయనమం డపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలు సులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్ తి శయనిస్తారు.
కుల శేఖరపడి :
శయనమండపానికి, శ్రీవారి గర్భా లయానికి మధ్యన రాతితో నిర్మించి న ద్వారబంధం ఉంది. అదే కులశే ఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.
గర్భాలయం :
కులశేఖరపడి అనే బంగారు గడపను దా టితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్ వయంభువుగా సాలగ్రామ శిలామూర్తి గా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భా లయం. దీనినే ”ఆనంద నిలయం” అంటా రు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరా ట్టు) :
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్ నందున ఈ ఆర్చామూర్తిని ”....స్ థానకమూర్తి....” అంటారు. అంతేగా క స్థిరంగా ఉన్నందువల్ల ”....ధ్ రువమూర్తి....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.






No comments :
Write comments