”స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా
అని స్వామిని తలంచిన అన్ని పాపా లు హరించబడుతాయి, కోరికలు ఈరేడు తాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగా ఢ విశ్వాసం.
భక్తజనప్రియుడు, ఆశ్రితకల్పతరు వు, కోరిన వరాలిచ్చే కోనేటిరాయు డైన శ్రీ వేంకటేశుడు వెలసివున్ న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే.
నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్ రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్ రతిరోజూ ఉత్సవమే. సుప్రభాతం, తో మాల, సహస్రనామార్చన వంటి నిత్యో త్సవాలు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారా భిషేకం వంటి వారోత్సవాలు, రోహి ణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్ వార్
తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్ పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవి త్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజూ ఒక పండుగగా, ప్రతిపూటా పరమాన్నభరి త నివేదనలతో, ఏడు కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా, ఆరాధింపబడుతున్నాడు.
సంవత్సరానికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయునికి ఉత్సవాలు 450 కి పైమాటే అంటే అతిశయోక్తి లేదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులై నా చాలవు. స్వామివారి ఉత్సవమూర్ తియైన శ్రీ మలయప్ప తన ఉభయదేవేరు లైన శ్రీభూదేవీలతో కూడి సర్వాం గసుందరంగా అలంకృతుడై తిరు ఉత్ సవాలలో పాల్గొంటూ తిరుమాడ వీధు లలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు.
పూర్వం బ్రహ్మోత్సవాల చరిత్ర
10వ శతాబ్దంలో పల్లవరాణి స్వా మవాయి కాలంలో తిరుమల శ్రీవారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్ సవాలు నిర్వహించినట్లు శాసనాధా రాలు ఉన్నాయి. ఆ కాలంలో పెరటాసి , మాఘ మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. 13వ శతాబ్దం వరకు ఈ సాంప్రదాయం కొనసాగింది.
అనంతరం వీర నరసింహ యాదవ రాయలు భార్య ఆడి నెలలో మూడో బ్రహ్మోత్ సవం ప్రారంభించినట్లు తెలుస్తోం ది. 14వ శతాబ్దంలో స్వామివారి బ్రహ్ మోత్సవాలను తిరుక్కొడి తిరునాళ్ అని సంభోదించేవారట. ఈ శతాబ్దం లో సంవత్సరానికి మూడుసార్లు బ్ రహ్మోత్సవాలు నిర్వహించేవారు. తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఒక బ్రహ్మోత్సవాలు జరిగే వి.
16 శతాబ్దం నాటికి వైశాఖం, ఆడి మాసాల్లో మినహా నెలకు ఒక్కటి చొ ప్పున బ్రహ్మోత్సవాలు నిర్వహిం చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోం ది. వైశాఖం, ఆడి మాసాల్లో తిరు పతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు . ఆరోజుల్లో అంకురార్పణతో కలిపి మొత్తం 12 రోజులు అంగరంగ వైభవం గా బ్రహ్మోత్సవాలు జరిగేవి.
గత కొన్ని శతాబ్దాల క్రితం వరకు సంవత్సరంలో నాలుగుసార్లు బ్రహ్ మోత్సవాలు నిర్వహించినట్లు శా సనాధారాలు ఉన్నాయి. పెరటాసి, రథ సప్తమి, కైశిక ఏకాదశి, వైకుం ఠ ఏకాదశి సమయాల్లో బ్రహ్మోత్సవా లు నిర్వహించినట్లు తెలుస్తోంది .
.jpg)
.jpg)
.jpg)


No comments :
Write comments