30.9.25

శ్రీవారి గరుడ వాహన సేవ విజయవంత నిర్వహణపై సీఎం చంద్రబాబు అభినందనలు cm congratulates




అత్యంత విశిష్టమైన తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవను అద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీ, జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.

తన అధికారిక X, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా స్పందించిన ముఖ్యమంత్రివర్యులు, ఈ పవిత్ర గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి తరలివచ్చిన  3 లక్షల మందికిపైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి అపూర్వమైన అనుభూతిని అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన టీటీడీ పాలకమండలి, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, తిరుమల కొండ పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తి పరవశంతో పాల్గొని తరించిన భక్త కోటికి ధన్యవాదాలు తెలిపారు.

No comments :
Write comments