సంగీతం,
ఈ సందర్భంగా డిపిపి కార్యదర్ శి మాట్లాడుతూ, సనాతన హైందవ ధర్మాన్ని సామాన్య ప్రజలకు దగ్గర చేయడానికి, సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని చైతన్ యవంతం చేయడానికి హరికథ ఒక ఆయు ధమన్నారు. పురాతన కాలంలో కళా కారులను పోషించిన రాజులు చరిత్ రలో నిలిచిపోయారని పేర్కొన్నారు . సైద్ధాంతిక వైభవం గల టీటీడీ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. హరి కథ శ్రీవారి వైభవంలో అతి ము ఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన హరిదాసు లు అనేక మెరగులు తీర్చిదిద్ది జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్లా లని పిలుపునిచ్చారు.
అనంతరం అదనపు కార్యదర్శి శ్రీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస గొప్ప కళారూపమైన హరికథకు ఆద్యు డిగా నిలిచారని, హిందూ మతానికి ఎనలేని సేవలు అందించారని తె లిపారు. ఆధ్యాత్మిక చింతనలో నాటి నుండి నేటి వరకు హరిక థ ప్రధాన ఆధ్యాత్మిక ప్రచారా నికి మూలమై అన్ని తరగతుల ప్ రజలను అలరిస్తుందన్నారు. హరికథ గొప్పదనం గురించి వివరిం చారు.
తరువాత రాష్ట్రంలోని వివిధ జి ల్లాల నుండి శిక్షణ తరగతు లకు విచ్చేసిన 30 మంది మహిళా హరిదాసులకు హరికథ పత్రం అం దించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ మతి విజయలక్ష్మీ, శ్రీ వెం కటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments