13.9.25

తిరుమలలో శ్రీవారి సేవకుల సేవలు అమోఘం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ nirmala sitaraman in tirumala






తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కొనియాడారు. 


తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో శుక్రవారం ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు.

ముందుగా అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.

అనంతరం ఆమె భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.

అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు.

ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు.

అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments