4.9.25

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ pavitra samarpanam





అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి  వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ  జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి.


అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠం ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ దిలీప్ ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments