టీటీడీ
ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు టీ టీడీ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగులకు వైద్య సే వలు అందించే అంశంపై అదనపు ఈవో చర్చించారు.
గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు శ్రీవారి సేవలో భాగంగా ప్ రొఫెషనల్ సేవలను ప్రవేశపెట్టా లనే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా వైద్య రంగం నుండి ఈ ప్రొఫెషనల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన చర్ యలను టీటీడీ ప్ర్రారంభించింది.
అందులో భాగంగా స్విమ్స్ డైరెక్ టర్ డా. ఆర్వీ కుమార్, బర్డ్ డై రెక్టర్ డా. జగదీశ్, ఎస్పీసిహె చ్సి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ సీఎంఓ డా. నర్ మద, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి అధిపతి డా. రేణు దీక్షిత్ లతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడు తూ టీటీడీ ఆసుపత్రుల్లో ఉచిత సే వలు అందించదలచిన వైద్యులు ఆన్లై న్లో బుకింగ్ చేసుకునేందుకు వీ లుగా ఓ ప్రత్యేక యాప్ను అభివృ ద్ధి చేయాలని జిఎంఐటి ఇంచార్జ్ శ్రీ ఫణికుమార్ నాయుడును ఆదేశిం చారు.
మొదటిసారి టీటీడీ ప్రొఫెషనల్ సే వలను ప్రవేశ పెడుతున్న కారణంగా గౌరవ ముఖ్యమంత్రివర్యుల సూచనల మేరకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో చీఫ్ పీఆర్వో డా. టీ.రవి, అశ్విని ఆసుపత్రి డిప్ యూటీ సివిల్ సర్జన్ డా. కుసుమ కుమారి, బర్డ్ మెడికల్ సూపరింటెం డెంట్ డా. వెంకా రెడ్డి, స్విమ్ స్ కు చెందిన డా. ఆలోక్ సచన్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments