11.9.25

శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : • ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి sadhu subramanya sastry








తిరుమలలోని శాసనాలను, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని తొండవాడకు చెందిన ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి అన్నారు.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం జరిగిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి సభ  ఘనంగా జరిగింది.
 ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి "  శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి ప‌రిశోధ‌నాదీక్ష " అనే అంశంపై  ఉప‌న్య‌సిస్తూ, శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా పురాతన వస్తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శాస్త్రికి దక్కిందన్నారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శాస్త్రి పరిష్కరించి సమాజానికి  అందించినట్లు ఆయన వివరించారు.
అనంత‌రం ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం సంస్కృత విభాగం ప్రొఫెస‌ర్ డా. శిరీష "  శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి ప‌రిశోధ‌నలో శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు " అనే అంశంపై  మాట్లాడుతూ, శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్య‌న్ని పాలించిన గొప్ప శ్రీ‌వారి భ‌క్తుడ‌ని చెప్పారు. ఆయన కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరింద‌ని, తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అనేక విలువైన ఆభ‌ర‌ణాలు ఇచ్చిన‌ట్లు ఆల‌య శాస‌నాల ద్వారా శ్రీ శాస్త్రీ ప్ర‌పంచానికి తెలియ‌జేసిన‌ట్లు చెప్పారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు  కూడా చదవాలన్నారు.  
పుష్పాంజలి :
అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 44వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ మేడ‌సాని మోహ‌న్‌ పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారి 103వ జయంతి సందర్భంగా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీ సి.ఎన్.మూర్తి, డిపిపి ప్రోగ్రాం అధికారి శ్రీ రాజ‌గోపాల్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ‌మ‌తి ల‌త‌, ప్ర‌ముఖ సాహితీవేత్త శ్రీ గౌరిపెద్ది వేంక‌ట శంక‌ర‌భ‌గ‌వాన్‌, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి :
•  ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి
తిరుపతి, 2025 సెప్టెంబ‌రు 10: తిరుమలలోని శాసనాలను, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని తొండవాడకు చెందిన ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి అన్నారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం జరిగిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి సభ  ఘనంగా జరిగింది.
 ఈ సందర్భంగా శ్రీ కృష్ణారెడ్డి "  శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి ప‌రిశోధ‌నాదీక్ష " అనే అంశంపై  ఉప‌న్య‌సిస్తూ, శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్టు వివరించారు. దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా పురాతన వస్తు పరిశోధనా శాస్త్రవేత్తగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శాస్త్రికి దక్కిందన్నారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శాస్త్రి పరిష్కరించి సమాజానికి  అందించినట్లు ఆయన వివరించారు.
అనంత‌రం ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం సంస్కృత విభాగం ప్రొఫెస‌ర్ డా. శిరీష "  శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి ప‌రిశోధ‌నలో శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు " అనే అంశంపై  మాట్లాడుతూ, శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్య‌న్ని పాలించిన గొప్ప శ్రీ‌వారి భ‌క్తుడ‌ని చెప్పారు. ఆయన కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరింద‌ని, తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అనేక విలువైన ఆభ‌ర‌ణాలు ఇచ్చిన‌ట్లు ఆల‌య శాస‌నాల ద్వారా శ్రీ శాస్త్రీ ప్ర‌పంచానికి తెలియ‌జేసిన‌ట్లు చెప్పారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు  కూడా చదవాలన్నారు.  
పుష్పాంజలి :
అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 44వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ మేడ‌సాని మోహ‌న్‌ పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారి 103వ జయంతి సందర్భంగా ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీ సి.ఎన్.మూర్తి, డిపిపి ప్రోగ్రాం అధికారి శ్రీ రాజ‌గోపాల్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ‌మ‌తి ల‌త‌, ప్ర‌ముఖ సాహితీవేత్త శ్రీ గౌరిపెద్ది వేంక‌ట శంక‌ర‌భ‌గ‌వాన్‌, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments :
Write comments