17.9.25

టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి భక్తులకు మరింతగా సేవ చేసేందుకు కృషి చేస్తా : టిటిడి ఈవో ttd board





టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో సమావేశమైన  శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. 

టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన ఈఓకు టిటిడి చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఈఓగా పనిచేసిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు.
టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన  ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి సూచనలను తీసుకుని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు.
అంతకుముందు టిటిడి చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను సన్మానించారు.

No comments :
Write comments