25.9.25

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి vice president






భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. 
అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ కు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments