తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
20 -11-2025(గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-11-2025(సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
25-11-2025(మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
.jpg)
No comments :
Write comments