తిరుమలలో అక్
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనా మాలతో శేషసాయి, శేషస్తుత్యం, శే షాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారం లో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యం త సన్నిహితునిగా వ్యవహరించే ఆది శేషువు శ్రీ వైకుంఠంలోని నిత్ యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు, దాసభక్తి కి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూ డా సాక్షాత్కరింపచేస్తాడు.
అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషు నికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.

No comments :
Write comments