23.10.25

రాజంపేటలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 03 వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట, కుంభాభిషేకం rajampet temple




అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి (108 అడుగుల) విగ్రహం వద్ద అక్టోబర్ 31 నుండి నవంబర్ 03వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట, కుంభాభిషేక సంప్రోక్షణం జరుగనుంది.


ఈ సందర్భంగా 31వ తేదీ సాయంకాలం యజమాన సంకల్పం, విశ్వక్సేన ఆరాధనము, యాగ సంకల్పం, రక్షా బంధనము, వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణం, మృత్యంగ్రహణం, అంకురార్పణం  చేపడుతారు.

నవంబర్ 01వ తేదీన ఉదయం భగవత్పుణ్యాహం, మానోన్మాన శాంతి హోమం, మహాకుంభరాధానం, ద్వాదశాక్షర, అష్టాక్షర, షడక్షర, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వక మూర్తి హోమం, వేద, ప్రబంధాధి పారాయణములు, పూర్ణాహుతి, శాత్తుమొర, తీర్థగోష్టి చేపడుతారు. సాయంత్రం మూర్తి హోమం, వేద, ప్రబంధ, విష్ణు సహస్రనామ పారాయణములు, జలాధివాసనము, పూర్ణాహుతి, బలి శాత్తుమొర నిర్వహిస్తారు.

నవంబర్ 02వ తేదీ ఉదయం భగవత్పుణ్యాహం, విమానగోపుర, ధ్వజ ప్రసాదములకు ఛాయాధివాసం, కర్మాంగస్నపనము, నేత్రోనిమ్మలనం, మూర్తి హోమం, వేదాది పారాయణములు, పూర్ణాహుతి, మహార్నివేదన, శాత్తుమొర, సాయంత్రం చతు:స్థానార్చన, శయ్యాదివాసం, జీవాధి తత్వన్యాస హోమం, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, గోష్టి చేపడుతారు.

నవంబర్ 03వ తేదీన ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 09 గం.లకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట అనంతరం ధ్వజారోహణం, మహార్నివేదన, మహా మంగళహారతి తదితర వైదిక కార్యక్రమాలు చేపడుతారు. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణోత్సవం, ప్రాకారోత్సవం, ధ్వజావరోహణంతో ప్రతిష్ట కుంబాభిషేక సంప్రోక్షణం ముగియనుంది.

No comments :
Write comments