శ్రీ వేంకటే
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవా లు పూర్తి అయిన మరుసటిరోజు ”భా గ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నే పథ్యంలో స్వామివారి భక్తాగ్రే సరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తి ని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్ తారు. తన పూదోటలో పూలు కోస్తున్ న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబో గా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు .
అనంతరం అనంతాళ్వారులు తన భక్తి ని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని వి షయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు . వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్ టలో కూర్చోబెట్టి స్వయంగా స్వా మివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్ వామివారు అతని కోరిక మేరకు బ్ రహ్మోత్సవాల మరునాడు తాను అనంతా ళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్ రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్సవారి” ఉత్ సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిం ది. స్వామివారు సాయంత్రం 4 గం టలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్ వారు తోటకు చేరి అక్కడ ప్రత్యే క పూజలందుకొని తిరిగి ఆలయంలోని కి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భా గ్సవారి ఉత్సవం సందర్భంగా నా ళాయరా దివ్య ప్రబంధం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్ రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments