15.10.25

మహా పూర్ణాహుతితో ముగిసిన చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు poornahuti





చంద్రగిరి  శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌హాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్టార్చ‌న‌, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

సాయంత్రం 5 గంటలకు శ్రీ కోదండరామ స్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వామి వార్లతో వీధి ఉత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరిండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శ్రీ ముని హ‌రిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments