తిరుమల శ్రీ
ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయం లో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్వరణం నిర్వహించారు. అర్ చకులకు విధుల కేటాయింపునే ఋత్వి క్వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొ క్కరికి ఒక్కో బాధ్యతను అప్పగి స్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
రాత్రి 7 గంటలకు శ్రీవారి సే నాధిపతి అయిన శ్రీ విష్వక్సే నుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్ రీవారి ఆలయానికి చేరుకున్నారు . రాత్రి 8 నుండి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్ పణ కార్యక్రమం నిర్వహించారు . అంకురార్పణం కారణంగా సహస్రదీ పాలంకార సేవను టిటిడి రద్దు చే సింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారు లు పాల్గొన్నారు.
అక్టోబర్ 30న పుష్పయాగం
శ్రీవారి ఆలయంలో గురువారం పు ష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుం డి 11 గంటల వరకు శ్రీదేవి భూ దేవి సమేత శ్రీ మలయప్పస్వామివా రి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షి ణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్ తారు. ఇందులో భాగంగా పాలు, పెరు గు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభి షేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం ని ర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీ పాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్ పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.


No comments :
Write comments