నవంబరు 2వ తేదీ
చారిత్రక వివరాలలోనికి వెళితే కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్ యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడై న శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్ రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినా డు ఆయనను మేల్కొల్పు చేయడం రివా జు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వు స్వరూపంగా భావించే కలియుగ ప్ రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్ వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్ వహిస్తుంది.
ప్రాశస్త్యం..
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్ యమైన పర్వదినాల్లో కైశికద్ వాదశి ఒకటి. శ్రీ వరాహ స్వా మి కైశికపురాణంలోని 82 శ్లోకా లతో శ్రీ భూదేవికి కథగా చెప్ పిన రోజును కైశిక ఏకాదశిగా పి లుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరిం చుకుంది.
నంబదువాన్ కథ…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం వి శేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీ నంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రా గంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్ రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తా నన్నాడు. అందుకు నంబదువాన్ సమా ధానంగా తాను ప్రస్తుతం శ్రీవారి కి సంకీర్తనార్చన చేయడానికి వె ళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశి క రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు . భక్త నంబదువాన్ భక్తికి, సత్ యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
సూర్యదయానికి ముందే ఎందుకు?
14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాస మూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండ గా సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భాగీ అగ్ ని ప్రమాదం జరిగింది. అప్పటి నుండి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఆస్థానం
ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున 4.30 నుం డి 5.45 గంటల వరకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7. 30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వా రా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.

No comments :
Write comments