9.11.25

నవంబరు 9న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన laksha bilwarchana




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 9వ తేదీన ఆదివారం లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఒక్కొక్క‌రు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి ల‌క్ష బిల్వార్చ‌న సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు. 

ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

No comments :
Write comments