6.11.25

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం annabhishekam








తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వైభవంగా అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు  సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments