25.11.25

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు aswa vahanam







తిరుచానూరు శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి  అమ్మవారు క‌ల్కి లంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారువాహనం ముందు గజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడు  వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువుఅందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయిపరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.

 వాహనసేవల‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామివో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీశ్రీమతి టి.జానకి దేవిశ్రీ నరేష్ కుమార్శ్రీ ఎంశాంతారామ్జేఈవో శ్రీ వీరబ్రహ్మంసివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ఇత‌ర అధికారులుఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments