29.11.25

తిరుమల పర్యావరణ పరిరక్షణకు టిటిడి పెద్దపీట environmental protection




తిరుమల పవిత్రతపర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పాత డీజిల్పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకురావడానికి టిటిడి విస్తృత చర్యలు చేపట్టినట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి తెలిపారు.


తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారంకేంద్ర రహదారు మంత్రిత్వ శాఖ (ఢిల్లీసీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధులుర్టీసీటిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలను సంపూర్ణ కాలుష్య హిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారుమొదటిగా తిరుపతితిరుమల మధ్య పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.


అదేవిధంగాతిరుమలలో నడిచే ట్యాక్సీలు మరియు ఇతర అద్దె వాహనాలను విద్యుత్ వాహనాలతో దశలవారీగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు సందర్భంగా ఢిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధి శ్రీ కునాల్ జోషి వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారుదీనిపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారుత్వరలో జరగనున్న టిటిడి బోర్డు సమావేశంలో  అంశంపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.


సమావేశంలో టిటిడి డీఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడువిజివో శ్రీ సురేంద్రఐటి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర్లునాయుడురాష్ట్ర రవాణాశాఖ అధికారులుఆర్టీసీ అధికారులుపోలీసు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments