28.11.25

అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధి ప‌నుల‌కు వైభవంగా అద్వేష్ట‌క శిలాన్యాస‌ము foundation ceremony

 









-  రూ.260 కోట్ల‌తో తిరుమ‌ల త‌ర‌హాలో శ్రీ‌వారి ఆల‌యం    

-  దేవ‌త‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలా మ‌న రాష్ట్ర రాజ‌దాని అమ‌రావ‌తి

-  ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్యంసంప‌ద‌ఆనందంతో జీవించాలి

-  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ రెండ‌వ ప్రాకారం అభివృద్ధి ప‌నుల‌కు  గురువారం ఉదయం 11 నుండి 11.30 గంటల నడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ‌అద్వేష్ట‌ శిలేష్టకాన్యాసం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన యాగ‌శాల‌కు శ్రీ దేవి భూదేవి స‌మే శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను వేంచేపు చేశారు. అనంత‌రం అర్చ‌కులు చతుర్వేద పారాయణంనివేదనందివ్య సమర్పణహోమంపూర్ణాహుతివేదాశీర్వచనం నిర్వహించారు.

మొద‌ట‌గా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు యాగ‌శాల‌కు వేంచేసి పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారుఅనంత‌రం అర్చ‌కుల వేద మంత్రాలుమంళ‌వాయిధ్యాలుభ‌క్తు గోవిదంనామ‌స్మ‌ర‌ణ‌ల న‌డుమ గౌ|| ముఖ్యమంత్రివర్యులు పునాది రాయి వేయడంతో ఆలయంలో ద్వితీయ మ‌హాప్రాకార‌ముచ‌తుర్థ్యార గోపుర‌ముల నిర్మాణామువివిధ‌ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

 సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు మాట్లాడుతూ పవిత్రమైన సంకల్పంతో మన రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామన్నారుకృష్ణా నది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే నకు శక్తి నిస్తుందన్నారుదేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదోఅదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపట్టామన్నారుశ్రీవారికి అప్రతిష్టపాలు చేసే  పనిని చేయననిశ్రీవారి సన్నిధిలో ఉన్నపుడు పవిత్రంగా ఉండాలన్నారుముఖ్యమంత్రిగా ఉన్నా  సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శిస్తున్నాననిగతంలో తప్పు చేసిన వారిని రెండు మూడు తరాల ర్వాత శిక్ష అనుభవించేవారనిఇపుడు  జన్మలోనే శ్రీవారు శిక్షిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామన్నారు.  ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్టీఆర్ ఉండగా టిటిడిలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారనితాను ముఖ్యమంత్రిగా స్విమ్స్ లో ప్రాణదానం స్కీం ను ప్రారంభించామన్నారు. 23 క్లైమోర్ బాంబులు పెట్టినా శ్రీవారు ప్రాణభిక్ష పెట్టారన్నారు.  అమరావతిలో 25 ఎకరాల్లో రూ.260 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత టిటిడి తీసుకోవాలని కోరారుప్రతి నిషికి ఆరోగ్యంసంపదసంతోషం ఉండేలా పాలన అందిస్తామన్నారు సందర్భంగా స్వచ్ఛందంగా 29 వేల మంది రైతులు, 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతులను అభినందిస్తున్నానన్నారు.  

అటు తర్వాతగౌరవ ముఖ్యమంత్రివర్యులు అమరావతిలోని శ్రీవారి లయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించిఅధికారులకు పలు సూచనలు చేశారుఅనంతరం గౌరవ ముఖ్యమంత్రి

ఆలయంలోని ధ్వజస్తంభానికి,  నమస్కరించిస్వామి వారిని దర్శించుకున్నారువేద పండితులు వేద ఆశీర్వచనం అందించారుఅనంతరం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గౌ.ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు అందించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు

 కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్రాష్ట్ర దేవాదాయ శా మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డిమున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పి.నారాయణసివిల్ సప్లయిస్ శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పలువురు టిటిడి బోర్డు సభ్యులుఅడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవో శ్రీ వి వీరబ్రహ్మం,  సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణజిల్లా కలెక్టర్జిల్లా ఎస్పీపలువురు అర్చకులుశ్రీవారి సేవకులుపలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

No comments :
Write comments