26.11.25

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం panchami teerdham

 







 - 
శ్రీవారి కానుక కమలముల హారంవజ్రాల అడ్డిగ

•  క‌నుల‌విందుగా సిరులతల్లికి  స్న‌ప‌న‌తిరుమంజ‌నం 

•  పద్మపుష్కరిణిలో పవిత్రస్నానంతో భక్తుల తన్మయత్వం

•  అసంఖ్యాకంగా పాల్గొన్న భక్తులు

•  అధికారులుసిబ్బందిపోలీసులుశ్రీవారి సేవకుల సేవలను అభినందించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుప‌తి, 2025 నవంబరు 25:శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానంఅశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగిందిపద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు

 సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూలక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారువేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు.  భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసివిజయవంతంగా జరిగాయన్నారుఅన్ని విభాగాల అధికారులుభద్రతా సిబ్బందిపోలీసులుశ్రీవారి సేవకులుపారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారుభక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని  సందర్భంగా ఆకాంక్షించారు.

అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారుఅనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారుతిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుందిఅర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు

అమ్మవారికి శ్రీవారి కానుక 

శ్రీ  పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ  వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారురూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం

వజ్రాల అడ్డిగ నగసారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా సిరులతల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికిచక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో  విశేషంగా అభిషేకం చేశారు సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వుపైనాపిల్,  డ్రై ఫ్రూట్స్రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్వట్టివేరుతులసిమాల‌లుకిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి

పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుందిఇందులో తామర పూలు, రోజాలులిల్లీలు తదితర సంప్రదాయ పుష్పాలుకట్ ఫ్లవర్స్ తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

మధ్యాహ్నం 12.10 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానంఘట్టం ఘనంగా జరిగిందిచక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారుఅనంతరం రాత్రి 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

 కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిటీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్చంద్రగిరి ఎంఎల్‌ఏ శ్రీ పులివర్తి నానిపలువురు బోర్డు స‌భ్యులు శ్రీ ఎన్సదాశివరావుశ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిశ్రీ నరేష్ కుమార్శ్రీ ఎం.శాంతారామ్శ్రీమతి జానకి దేవిశ్రీమతి అనుగోలు రంగశ్రీఎక్స్ అఫిషియో మెంబర్  శ్రీ సి.దివాకర్ రెడ్డి

జెఈవో శ్రీ వి.వీరబ్రహ్మంసివిఎస్‌వో శ్రీ కే.విమురళీకృష్ణఎస్పీ శ్రీ ఎల్ . సుబ్బరాయుడుసిఈ శ్రీ సత్యనారాయణఎఫ్  అండ్ సీఏవో శ్రీ  బాలాజీడెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

న‌వంబరు 26 పుష్పయాగం

న‌వంబరు 26 తేదీ బుధ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు వైభవంగా జరుగనుంది

No comments :
Write comments