మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ అన్నారు. టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశమన్నారు. చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు.
అనంతరం గీతా జయంతి వేడుకలలో మొదటి విభాగం నందు ప్రథమ బహుమతి 1. కెపి శ్రీ ముకుంద, ద్వితీయ బహుమతి కేపీ శ్రీ, తృతీయ బహుమతి ఎం వైష్ణవి పొందారు.
రెండవ విభాగంలో....
1. డి నిశాంత్ చక్రవర్తి
2. ఎం జస్వంత్
3. ఎస్ నాగవేణి
మూడవ కేటగిరీలో...
1. పీహెచ్ వెంకటనారాయణ
2. ఎం లహరి
3. ఎస్ ఉమామహేశ్వరి
బహుమతులు గెలుపొందారు.
విజేతలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ బహుమతులు ప్రదానం చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
అంతకుముందు శ్రీ ఆముదాల మురళి, శ్రీ కేటివి రాఘవన్, శ్రీమతి సునీత తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీ హెడ్డిపిపి ఏఈవో శ్రీ సి. సత్యనారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి కోకిల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments