16.12.25

తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరు, గోవింద‌రాజ‌స్వామి ఆల‌యాల్లో భ‌క్తుల నుండి అభిప్రాయ సేక‌ర‌ణ‌ devotee feedback





దేశ‌వ్యాప్తం ఉన్న 60 టీటీడీ  ఆలయాల్లో భ‌క్తులు  సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిష‌న్లుక్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారుతిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల య‌న కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం ఈవో సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.


 సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించ‌ద‌ల‌చిన ఐదువేల ఆల‌యాల‌కు గాను అవసరమైన రెండుమూడు డిజైన్లు సిద్ధం చేయాల‌ని సీఈని దేశించారుత‌ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆల‌యాల నిర్మాణ ప్ర‌క్రి వేగ‌వంత‌మ‌వుతుంద‌ని తెలిపారు.


తిరుప‌తిలోని వినాయ‌క న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్ట‌ర్స్ ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప‌నుల‌ను కూడా వేగ‌వంతం చేయాల‌న్నారుఅదేవిధంగా కాంట్రాక్ట‌ర్లకు చెల్లించాల్సిన బిల్లుల విష‌యంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాల‌న్నారు.


అప్ప‌లాయ‌గుంట ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు స‌మాచారం తెలిసేలా స‌మాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారుశ్రీ‌వారి  ఆలయం లో ఉన్న క‌దిలే వంతెన మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను వైకుంఠ ఏకాద‌శిలోపు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారుముంబైలోని బాంద్రా  ఆల‌యంలో జేఈవోచీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారుల‌తో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేసి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు


స్థానికాలయాల‌కు నియ‌మించిన ప్ర‌త్యేక అధికారులు ఆయా ఆల‌యాల భివృద్ధికి సంబంధిత అధికారుల తో స‌మ‌న్వ‌యం చేసుకుని స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా ఆదేశించారుతిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరుతిరుప‌తి గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో కూడా టీటీడీ అందిస్తున్న సేవ‌ల‌పై భ‌క్తుల నుండి భిప్రాయ సేక‌ర‌ణ చేయాల‌ని చెప్పారు.


క‌ర్ణాట‌క‌లోని బెల‌గావి లో ఆల‌యం నిర్మాణంబీహార్ లోని పాట్నాలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి స్థ‌లం కేటాయింపుపై ఆయా అధికారులతో సంప్ర‌దించి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు


ధార్మిక ప్ర‌చుర‌ణ‌ల‌కు సంబంధించి ఇదివ‌ర‌కే ముద్రించిన పుస్త‌కాల పంపిణీ విష‌యంలో త‌గు సూచ‌న‌లు చేసేందుకు నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయాల‌న్నారుఅదేవిధంగా టీటీడీ ప్ర‌చుర‌ణ‌ల్లో బాగా డిమాండ్ ఉన్న పుస్త‌కాల‌ను పాఠ‌కుల అభిరుచి మేర‌కు  పునర్ ముద్రణకు  త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న జేఈవోకు సూచించారు.


 స‌మావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంసీవీ&ఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌ఎఫ్ఏ&సీఏఓ శ్రీ బాలాజీసీఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌డిప్యూటీ సీఎఫ్ శ్రీ ఫ‌ణి కుమార్ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments