24.12.25

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam








తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.


 సందర్భంగా ఆలయం వెలుపల ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూసాధారణంగా ఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవాలువైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకుశ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలుఆలయ ప్రాంగణంపోటుగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసినీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారుప్రత్యేక పూజనైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు.


వైకుంఠ ద్వార దర్శనాలకు పగడ్బంది ఏర్పాట్లు


 సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశనిష్క్రమణ మార్గాలుభద్రతా ఏర్పాట్లుఅన్న ప్రసాదాలువసతిక్యూ లైన్ల నిర్వహణపార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు.


సామాన్య భక్తులకే పెద్ద పీట


గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.


డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 వైకుంఠ ద్వాదశిజనవరి 1 తేదీలకు సామాన్య భక్తులకు -డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారుభక్తులందరికీ వకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు -డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు -డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను -డిన్ ద్వారా ఎంపి చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు.


టోకెన్ పొందిన భక్తులు నిర్దేశి సమయంలోనే దర్శనానికి రావాలి


 మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేదిసమయాన్ని కేటాయించడం జరిగిందని మయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.


టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం


-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8 తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారుమొదటి మూడు రోజులు మాత్రమే -డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామనిచివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుం ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.


జననరి 2 నుండి 8 తేది వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంశ్రీవాణి దర్శనాలు


అదేవిధంగా జనవరి 2 నుండి 8 తేది వరకు రోజుకు 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, 1500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశామని చెప్పారు


జనవరి 6,7,8 తేదీల్లో స్థానికులకు దర్శనం


తిరుపతితిరుమల స్థానికులకు స్థానికుల కోటా కింద జనవరి 6,7,8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు.


ప్రత్యేక దర్శనాలు రద్దు


వైకుంఠ ద్వార దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే కారణంగా చంటి పిల్లల తల్లిదండ్రులువృద్ధులుదివ్యాంగులుఎన్ఆర్ఐడిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని చెప్పారు.


భక్తులకు విరివిగా అన్న ప్రసాదాలు


శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.


కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు


భద్రతకు సంబంధించి 3500 మంది పోలీసులు, 1150 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారుఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు.


భక్తులందరూ టీటీడీ సూచనలు పాటిస్తూ సంయమనంతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని ఈవో తెలియజేశారు.


No comments :
Write comments