28.12.25

వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు local temples





డిసెంబ‌రు 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారుఅన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లుచలువ పందిళ్లురంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించ‌నున్నారుతిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు


 శ్రీ గోవింద‌రాజ‌వారి ఆలయంలో...


తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా  స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం  నిర్వహిస్తారువేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.  ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.  


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో...


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావైధనుర్మాస కైంకర్యాలు జ‌రుగ‌నున్నాయిఉద‌యం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారుసాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఆస్థానం నిర్వ‌హిస్తారు.


శ్రీనివాసమంగాపురంలో ...


డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం  నిర్వహిస్తారువేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.


అదేవిధంగా డిసెంబ‌రు 31  వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం  తోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం  నిర్వహిస్తారుఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.


అప్పలాయగుంటలో ....


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపిధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారుఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుసాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుందిఅనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.


డిసెంబ‌రు 31 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు  స్నపన తిరుమంజనం,  చక్రస్నానం నిర్వహించనున్నారు.


నారాయణవనంలో ...


నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపిధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం నిర్వహిస్తారుఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవంఆస్థానం నిర్వహించనున్నారు.


డిసెంబ‌రు 31 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది


అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంచంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంకార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంపిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంకీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంబెంగుళూరుహైదరాబాద్విశాఖపట్నంఅమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


No comments :
Write comments