మంత్రాలయం
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంధ్ర తీర్థ స్వామీజీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మేలు చేస్తున్న విధానాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. భక్తులకు ఎప్పటికప్పుడు మేలు చేసే విధంగా సాంకేతికతను ఉపయోగించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అభినందనలు తెలియజేశారు.
ఆ తర్వాత స్వామీజీ తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 (PAC-5) ను సందర్శించారు. భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అనిర్వచనీయమని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవోతో స్వామీజీ మాట్లడుతూ మంత్రాలయంలో కూడా ఈ తరహా విధానాలను అనుసరించి భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపడతానని తెలియజేశారు.
No comments :
Write comments