20.12.25

హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలు: టిటిడి PANCHALOHA IDOLS TO HINDU TEMPLE




ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్గొడుగులుశేషవస్త్రంరాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది.


నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారిటిటిడి పరిపాలనా భవనంకె.టి.రోడ్డుతిరుపతి అనే చిరునామాకు పంపాలిఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించగలరు.  


మైక్ సెట్:


•  మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సిఎస్ టి లకు 90% రాయితీ మినహాయించి రూ.2,500/- డి.డితీసి పంపించాల్సి ఉంటుంది.  ఇతరులకు 50% రాయితీ మినహాయించి రూ. 12,500/- చెల్లించాల్సి ఉంటుంది

•  ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రంసంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటోఆలయ కరెంట్ బిల్లుదరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.


గొడుగులు :


హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 %  రాయితీతో రూ.7,250 లకే టిటిడి అందిస్తుంది.  


•  ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రంసంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్  / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్ఆల ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలిసదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250/- లకు డి.డిను జత చేసి పంపాలి.


శేష వస్త్రం :


హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష స్త్రాన్ని టిటిడి ఉచితంగా అందిస్తోందిఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారితిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలిసంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖదరఖాస్తు దారు ఆధార్ కార్డుఆలయ ఫోటోను జత చేయాలి.


రాతి & పంచలోహ విగ్రహాలు


శ్రీ వేంకటేశ్వర స్వామిశ్రీ ద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులుఅంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు.  మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25% ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారుఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు


పంచలోహ విగ్రహాలను ఏపీతెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 90% సబ్సిడీతోఇతర వర్గాల వారికి 75% సబ్సిడీతో అందిస్తారు.  


•  దేవతా మూర్తుల రాతి మరియు పంచలోహల విగ్రహాల పేర్లుకొలతలతో కార్యనిర్వహణాధికారిటిటిడి వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి.  


•  దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్ / అసిస్టెంట్ కమీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శా తాజా సిఫార్సు లేఖఆలయ బ్లూ ఫ్రింట్ ను సైజ్ లో మరియు అవసరమైన విగ్రహాల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో,  దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.


•  ఎం..వో లేదా డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50% సబ్సిడీతో టిటిడి అందిస్తోంది.  

•  మఠాలుట్రస్ట్ లకుఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50% రాయితీతో అందిస్తారు.

No comments :
Write comments