22.12.25

శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ పెద్దపీట priority to common devotees







తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు


తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆదివారం ఉదయం ఈవో కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు మరియు టిటిడి సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు


 సందర్భంగా ఈవో మాట్లాడుతూఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణవాహనాల భద్రతకు టిటిడి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారుఇందులో భాగంగా సుమారు రూ.8లక్షల విలువైన 20 బ్రెత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీ కి అందించినట్లు చెప్పారు


అదేవిధంగా భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుoదన్నారుఇందుకు కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధమని తెలిపారు.


అనంతరం జిల్లా ఎస్పీ  బ్రెత్ నలైజర్ల పనితీరును ఈవోకు వివరించారుమొత్తం 20 పరికరాలలో చెరో 04 తిరుమల మరియు అలిపిరిలలో, 12 తిరుపతిలో పోలీస్ శాఖ వినియోగిస్తుందని తెలిపారు


 కార్యక్రమంలో తిరుపతితిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments