తిరుమల
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆదివారం ఉదయం ఈవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు మరియు టిటిడి సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతకు టిటిడి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.8లక్షల విలువైన 20 బ్రెత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీ కి అందించినట్లు చెప్పారు.
అదేవిధంగా భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుoదన్నారు. ఇందుకు కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధమని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ ఈ బ్రెత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాలలో చెరో 04 తిరుమల మరియు అలిపిరిలలో, 12 తిరుపతిలో పోలీస్ శాఖ వినియోగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments