తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వరకు నిర్వహించారు.
ఐదేళ్లలోపు పిల్లలకు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇంఛార్జ్ డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఎస్వీ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కిషన్, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments :
Write comments