తిరుచానూరులో టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్. నిత్యశ్రీ దంపతులు సోమవారం ఉదయం స్వామివారికి 24 వెండి కాసుల హారంను బహుకరించారు.
ఈ సందర్భంగా 24 వెండి కాసులతో తయారు చేసిన గండ పేరుండంతో పొదిగిన వెండి కాసుల హారాన్ని దాత శ్రీమతి ఎన్ నిత్యశ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్, శ్రీ శ్రీహరి, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments